📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంపహల్గామ్ తరహా ఉగ్రదాడి.. పేరు అడిగి హిందూ కార్మికులపై కాల్పులు !

పహల్గామ్ తరహా ఉగ్రదాడి.. పేరు అడిగి హిందూ కార్మికులపై కాల్పులు !

కుల్గామ్‌లో ఒకరు మృతి, మరొకరికి గాయాలు.. లష్కరే తోయిబాపై అనుమానాలు !

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు పహల్గామ్ దాడిని తలపించేలా మరో దారుణానికి పాల్పడ్డారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న వలస కార్మికుల పేర్లు అడిగిన అనంతరం ఇద్దరు హిందూ కార్మికులను వేరుచేసి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న పలువురు కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అయినప్పటికీ, బాధితులైన ఇద్దరే హిందువులు కావడంతో మతపరమైన లక్ష్యంతోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనలో ఒక స్థానిక ఉగ్రవాది, ఒక విదేశీ ఉగ్రవాది ప్రమేయం ఉండొచ్చని దర్యాప్తు కొనసాగుతోంది. గత ఏడాది లష్కరే తోయిబా/ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)లో చేరిన మహ్మద్ లతీఫ్ పాత్రపై కూడా విచారణ సాగుతోంది.

ఈ ఘటనను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులను వెంటనే మట్టుబెట్టాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని పోలీసులు, భద్రతా బలగాలు చుట్టుముట్టి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఖండిస్తూ, ఉగ్రవాదంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!