బీఎల్వోలు, బీఎల్ఏల ఆధ్వర్యంలో ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ.
ఓటర్లకు అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు
రామాయంపేట జూలై 6 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, బీఎల్ఏలు ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరిస్తూ కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాల సవరణ ప్రక్రియను చేపట్టారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకుని సరిచేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గడిల నగేష్, సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, ఉపసర్పంచ్ బాబు, కాట్రియాల్ సిద్దరాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్వోలు, బీఎల్ఏలు పాల్గొని ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

