📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వలస కార్మికుల కోసం మెగా వైద్య శిబిరం

వలస కార్మికుల కోసం మెగా వైద్య శిబిరం

సినార్డ్–టీబీ అలర్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు

చీమకుర్తి, ఆగస్టు 9 (నవజ్యోతి న్యూస్) : వలస కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సినార్డ్ సంస్థ, టీబీ అలర్ట్ ఇండియా ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో శుక్రవారం ఆపిల్ క్వారీలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. క్వారీలో పనిచేస్తున్న వలస కార్మికులు, సిబ్బందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు క్షయ, హెచ్ఐవీ వ్యాధులపై అవగాహన కల్పించారు. శిబిరంలో సుమారు 180 మంది కార్మికులు, సిబ్బందికి హెచ్ఐవీ పరీక్షలు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, గుండె విద్యుత్ పరీక్ష, రక్తపోటు, రక్తంలో చక్కెర, కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిపై తగిన సూచనలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ క్షయ, హెచ్ఐవీ వ్యాధులపై ఉన్న అపోహలను వీడి, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వలస కార్మికులు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించి నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపిల్ క్వారీ జనరల్ మేనేజర్ శిద్ధా పవన్, మైన్స్ మేనేజర్ లోకేష్, సినార్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, టీబీ అలర్ట్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రదీప్, కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, సినార్డ్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరం నిర్వహించిన సంస్థలను క్వారీ యాజమాన్యం అభినందించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!