ఆగస్టు 18 నుంచి 20 వరకు దరఖాస్తులకు అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి):
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్/బీడీఎస్ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించారు.
ఆగస్టు 18 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్
గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 12న ముగిసిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అభ్యర్థుల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల నేపథ్యంలో ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు తిరిగి ప్రారంభించారు.
NEET UG 2026లో కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత గడువులో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ తెలిపింది.
ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు
ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇతర వివరాల కోసం ఆగస్టు 4న కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన గత నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్ను పరిశీలించాలని సూచించారు.
ఆన్లైన్లోనే దరఖాస్తు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్కు ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు https://tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు.

