బిక్కనూరు, జూలై 12 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలంలోని గుర్జకుంట గ్రామంలో గొల్ల సిద్దయ్య ఇంటి సమీపంలోని బజార్ లైన్కు ఆటోమేటిక్ టైమర్ ఏర్పాటు చేశారు. గ్రామంలోని అన్ని వీధి దీపాలు ఒకే సమయానికి వెలిగేలా ఈ వ్యవస్థను అమలు చేశారు.
టైమర్ ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకు వీధి దీపాలు ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. ఈ విధానం ద్వారా వీధి దీపాల నిర్వహణ సులభతరం కావడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా క్రమబద్ధీకరించబడుతుందని గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

