📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎల్‌నినోతో అప్రమత్తం.. రైతులకు అండగా నిలవాలి !

ఎల్‌నినోతో అప్రమత్తం.. రైతులకు అండగా నిలవాలి !

తక్కువ నీటితో పంటల సాగుపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి: పోచారం

నిజామాబాద్‌, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌లో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యతపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఇంచార్జి కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటితో పంటను కాపాడుకునే మార్గాలను రైతులకు వివరించాలని పోచారం సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రోత్సహించాలని అన్నారు.

నిజాంసాగర్‌ నీటి నిల్వలపై ఆందోళన

నిజాంసాగర్‌లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో రానున్న రోజుల్లో సాగునీటి పంపిణీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని వృథా కాకుండా వినియోగిస్తూ అవసరాలను బట్టి ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలి

గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి వర్షాభావ పరిస్థితులపై అవగాహన కల్పించాలని, పంటల ఎంపిక, నీటి వినియోగంపై వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు ఇవ్వాలని పోచారం కోరారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు అవసరమైన సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!