📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆగస్టు 17 నుంచి ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి !

ఆగస్టు 17 నుంచి ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి !

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం.. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల అమలుపైనా సమీక్ష

హైదరాబాద్, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): ఆగస్టు 17 నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల అమలు, ప్రజావాణి కార్యక్రమంపై సమీక్షించారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై సమీక్ష

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

17 నుంచి ప్రజావాణి

ఆగస్టు 17 నుంచి ప్రతి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని సీఎస్‌ సూచించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని సీఎస్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా సమన్వయంతో, ప్రజా కేంద్రిత పాలన అందించాలని కలెక్టర్లకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!