📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeHealth & Fitnessఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన – సేవాదాతలకు అభినందనలు

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన – సేవాదాతలకు అభినందనలు

మిర్యాలగూడ, జూలై 01 (నవజ్యోతి ప్రతినిధి) జీజేసీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్, జనయేత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పదవీ విరమణ పొందిన శారీరక విద్యా సంచాలకులు కామిశెట్టి సత్యనారాయణ ఆర్థిక సహాయం అందించి కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. శిబిరంలో పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొని వందలాది మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు, అవసరమైన సూచనలు అందించారు. భారతీయ వైద్యుల సంఘం కు చెందిన వైద్యులు కూడా శిబిరంలో పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 17వ వార్డు కౌన్సిలర్ నూకల కవిత–వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.మునీర్ షరీఫ్, జీజేసీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, ప్రధాన కార్యదర్శి కొర్ర కృష్ణకాంత్ నాయక్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. శిబిరంలో వందలాది మంది ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!