📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిజిల్లాలో పార్టీని ప్రతి మండలం, ప్రతి గ్రామానికి తీసుకెళ్తా : బొంగుల ఉమరాణి

జిల్లాలో పార్టీని ప్రతి మండలం, ప్రతి గ్రామానికి తీసుకెళ్తా : బొంగుల ఉమరాణి

హైదరాబాద్, జూలై 24 (నవజ్యోతి న్యూస్) : ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జనచైతన్య సభ రాష్ట్ర స్థాయి సమావేశంలో సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బొంగుల ఉమారాణి ఆధ్వర్యంలోని జిల్లా బృందం చురుకుగా పాల్గొంది. రాష్ట్ర ఇన్‌చార్జి ప్రియాంక కక్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంగారెడ్డి ప్రతినిధులు పార్టీ బలోపేతంపై చర్చించారు.

సమావేశంలో రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత విస్తరించడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయడం, యువత, మహిళలు, రైతులు, కార్మికులను పార్టీతో అనుసంధానం చేయడం వంటి అంశాలపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బొంగుల ఉమారాణి మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని ప్రతి మండలం, గ్రామానికి తీసుకెళ్లే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా అని, ప్రజల్లో విశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సమావేశంలో సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వంతో ప్రత్యేకంగా సమావేశమై జిల్లా పరిస్థితులు, పార్టీ విస్తరణకు సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!