సంగారెడ్డి, జూలై 28 (నవజ్యోతి న్యూస్):
కందిలోని ఐఐటీ హైదరాబాద్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిషాంత్ నీనా సక్సేనా ప్రతిష్ఠాత్మక ఎక్సలెన్స్ ఇన్ టెక్నాలజీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఐఐటీ ఖరగ్పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రకటించారు.
సాంకేతిక ఆవిష్కరణలు, వాటిని విజయవంతంగా వాణిజ్యీకరించడంలో చూపిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తారు. డాక్టర్ నిషాంత్ నీనా సక్సేనా సాధించిన ఈ ఘనత ఐఐటీ హైదరాబాద్కు మరో ప్రతిష్ఠను తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. సాంకేతిక రంగంలో పరిశోధనలను సమాజ అవసరాలకు అనుగుణంగా మలుస్తూ వినూత్న ఆవిష్కరణలకు ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

