తెల్లవారుజామున 3 గంటలకు వికసించిన ‘బ్రహ్మ కమలాలు’.. శ్రావణ శుభారంభంతో కుటుంబంలో ఆనందం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
శ్రావణమాసం తొలి రోజున సూరారం విశ్వకర్మ కాలనీలోని ఓ ఇంట్లో అరుదైన ప్రకృతి దృశ్యం
ఆవిష్కృతమైంది. విశ్వకర్మ కాలనీ టెంపుల్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ విశ్వకర్మ కాలనీ
అధ్యక్షుడు ఎస్. జీవన్రెడ్డి ఇంట్లో బ్రహ్మ కమలాలు వికసించాయి.
తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో బ్రహ్మీ ముహూర్తంలో పుష్పాలు వికసించడంతో
కుటుంబ సభ్యులు ఆనందానికి లోనయ్యారు. శ్రావణమాసం తొలి రోజే ఈ పుష్పాలు వికసించడాన్ని వారు
ఆధ్యాత్మిక విశేషంగా భావిస్తున్నారు.
అరుదుగా వికసించే బ్రహ్మ కమలాలు ఇంట్లో పూయడం శుభసూచకమని కుటుంబ సభ్యులు భావిస్తూ
ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
సాధారణంగా రాత్రివేళ వికసించి కొద్దిసేపటికే వాడిపోయే బ్రహ్మ కమలాల వికాసాన్ని చూసేందుకు
స్థానికులు ఆసక్తి చూపారు. శ్రావణమాసం తొలి రోజునే ఈ అరుదైన పుష్పాలు వికసించడంతో
విశ్వకర్మ కాలనీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
“ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాం.. ఆదిపరాశక్తి అనుగ్రహంతో మా ఇంట్లో
బ్రహ్మ కమలాలు వికసించడం ఎంతో ఆనందంగా ఉంది” అని జీవన్రెడ్డి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
శ్రావణమాసం ప్రారంభంలోనే అరుదైన పుష్పాలు వికసించడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు
వాటిని ఆసక్తిగా తిలకించారు. ప్రకృతి అందంతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసాలను మేళవించిన ఈ ఘటన
కాలనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

