సంఘసేవకుడికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు.. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడి.
మనోహరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి నవీన్): బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన సంఘసేవకుడు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్, రఘునందన్రావులకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

