📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్స్వేచ్ఛకు బాధ్యత తోడుండాలి !

స్వేచ్ఛకు బాధ్యత తోడుండాలి !

దేశ ప్రయోజనాలే ముందుండాలి.. యువతకు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పిలుపు..

స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే హక్కు కాదని, ప్రతి స్వేచ్ఛకు బాధ్యత కూడా తోడుగా ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే భావన యువతలో పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు.

లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో అజిత్ దోవల్‌కు ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దోవల్.. ప్రజాస్వామ్యంలో ప్రతి హక్కుకు బాధ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. స్వేచ్ఛను కొందరు తమకు నచ్చినట్లు ప్రవర్తించే అవకాశంగా భావిస్తున్నారని, కానీ సమాజం, దేశం పట్ల బాధ్యతను విస్మరించకూడదన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను నేటి తరం గుర్తుంచుకుని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఇదేనని దోవల్ అన్నారు. దేశ అభివృద్ధి, భద్రత, సామాజిక బాధ్యతల పట్ల యువత చైతన్యంతో ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో అజిత్ దోవల్ అందించిన వ్యూహాత్మక సలహాలు, సేవలు విశేషమని కొనియాడారు. జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి దేశానికి ఎంతో ఉపయోగపడిందని ప్రశంసించారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!