📄 ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం !

నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం !

తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్.. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో సమన్వయ కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి):

నేపాల్‌లో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్ర, నేపాల్ అధికారులతో సమన్వయం

నేపాల్‌లో పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన సహాయం కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, కాఠ్‌మాండు‌లోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో తెలంగాణ భవన్ సమన్వయం చేసుకుంటోంది. తెలంగాణకు చెందిన పర్యాటకులు, యాత్రికులు లేదా ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం అందితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించేలా చర్యలు చేపట్టనున్నారు.

బంధువులు వివరాలు అందించాలి

నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, యాత్రికులు లేదా పర్యాటకులతో సంబంధాలు తెగిపోయిన వారు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. బాధితుల వివరాలను అందించడం ద్వారా వారిని గుర్తించేందుకు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

అందించాల్సిన వివరాలు:

  • నేపాల్‌లో ఉన్న వ్యక్తి పేరు
  • పాస్‌పోర్ట్ వివరాలు
  • మొబైల్ నంబర్
  • ప్రస్తుతం లేదా చివరిగా తెలిసిన ప్రాంతం
  • ప్రయాణ సంస్థ లేదా టూర్ ఆపరేటర్ వివరాలు
  • కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు

తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ నంబర్లు

శ్రీమతి వందన
రెసిడెంట్ కమిషనర్‌కు పీఎస్, సమన్వయ బాధ్యతలు
మొబైల్: 9871999044

శ్రీ చ. చక్రవర్తి
ప్రజా సంబంధాల అధికారి
మొబైల్: 9949351270

శ్రీ జి. రక్షిత్ నాయక్
లైజన్ అధికారి
మొబైల్: 9618597969

నిరంతరం పరిస్థితులపై పర్యవేక్షణ

సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సహాయం అవసరమైన తెలంగాణ వాసుల వివరాలు హెల్ప్‌లైన్‌కు అందిన వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి ప్రాధాన్యతతో తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం సూచన: నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులతో సంబంధాలు ఏర్పడకపోతే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను హెల్ప్‌లైన్‌కు అందించాలి. సంబంధిత అధికారుల నుంచి అందే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!