సంగారెడ్డి, నవజ్యోతి వెబ్ : సంగారెడ్డి పట్టణంలోని పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ నవీన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన స్నేహితులంతా ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక కళాశాలను స్థాపించి వందలాది మందికి నర్సింగ్ విద్యను బోధిస్తున్నందుకు అభినందించారు. జీవితంలో స్థిరపడేందుకు దోహద పడుతున్నందుకు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల్, మాణిక్ ప్రభు మందిరం కమిటీ అధ్యక్షుడు ఆమెటి కిట్టు, మల్లికార్జున గౌడ్ శ్రీనివాస్, కృష్ణ శ్రీహరి ప్రవీణ్, సునీల్, రాహుల్, కార్తీక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు, సిబ్బంది కూడా నవీన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

