‘పదవికి, పర్యటన ఉద్దేశానికి తగిన కార్యక్రమం కాదు’.. విదేశాంగ శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించిన వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై
విదేశాంగ శాఖ (MEA) స్పష్టత ఇచ్చింది. విదేశీ పర్యటనలకు రాజకీయ క్లియరెన్స్ ఇచ్చే ముందు
ప్రతిపాదిత కార్యక్రమాలను పరిశీలిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనలో ప్రతిపాదించే కార్యక్రమాలు
ఆ పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినవిగా ఉండాల్సి ఉంటుందని MEA స్పష్టం చేసింది.
రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విషయంలో ఈ ప్రమాణం సరిపోలలేదని తెలిపింది.
In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied.’’
యూకేకు మాత్రం క్లియరెన్స్
రేవంత్రెడ్డి ప్రతిపాదించిన యూకే పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ ఇచ్చినట్లు
జైస్వాల్ స్పష్టం చేశారు. అంటే మొత్తం విదేశీ పర్యటనను తిరస్కరించలేదని,
అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రతిపాదిత కార్యక్రమాల విషయంలోనే క్లియరెన్స్ ఇవ్వలేదని MEA వివరణలో స్పష్టమవుతోంది..

