- సొంత నిధులతో వార్డులో చెత్త బుట్టల పంపిణీ…
మనోహరబాద్, 26 జులై ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ కుమార్) :
మెదక్జి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తడి,పొడి చెత్త సేకరణకు చెత్త బుట్టలు పంపిణీ చేయాలనే ఆదేశాల మేరకు మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో వార్డు సభ్యులు సత్యనారాయణ, సలీం,రత్నమాల, వారి వార్డులో ఆదివారం నాడు సొంత నిధులతో తడిపొడి చెత్త సేకరణకు నాలుగు రకాల చెత్త బుట్టలుపంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రత దృష్టిలో పెట్టుకొని సహకరించాలని కోరారు.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రత పాటిస్తే రోగాల బారిన పడకుండా ఉంటామని తెలిపారు.గ్రామ అభివృధి కోసం ఎల్లవేళల కృషి చేస్తున్నామని అన్నారు.

