📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మూడేళ్ల నిరీక్షణకు బ్రేక్‌.. భారత్‌లో శస్త్రచికిత్స.. వేల పౌండ్లు మిగిల్చుకున్న తెల్లోడు!

మూడేళ్ల నిరీక్షణకు బ్రేక్‌.. భారత్‌లో శస్త్రచికిత్స.. వేల పౌండ్లు మిగిల్చుకున్న తెల్లోడు!

బ్రిటన్‌లో మోకాలి ఆపరేషన్‌కు ఏళ్ల తరబడి వెయిటింగ్‌.. భారత్‌కు వచ్చి ఒకేసారి రెండు మోకాళ్ల మార్పిడి

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న 51 ఏళ్ల బ్రిటిష్‌ వ్యక్తి జీన్‌ పాల్‌.. చికిత్స కోసం మూడేళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక అంతకాలం నిరీక్షించకూడదని నిర్ణయించుకుని భారత్‌ బాట పట్టారు. ది మెడికల్‌ ట్రావెల్‌ కంపెనీ ద్వారా భారత్‌కు వచ్చిన ఆయన మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో ఒకేసారి రెండు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

బ్రిటన్‌లో మోకాళ్ల సమస్య కారణంగా ఆయనకు నిత్యజీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చికిత్స కోసం ప్రైవేట్‌గా ఇమేజింగ్‌ స్కాన్లకు కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే NHSలో శస్త్రచికిత్స కోసం సుమారు మూడేళ్ల వెయిటింగ్‌ ఉండటంతో భారత్‌లో వైద్యం పొందాలని నిర్ణయించుకున్నారు.

మూడేళ్ల వెయిటింగ్‌కు బదులు.. భారత్‌!

భారత్‌కు చేరుకున్న జీన్‌ పాల్‌కు మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో రెండు మోకాళ్లకు ఏకకాలంలో రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స నిర్వహించారు. బ్రిటన్‌లో ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన శస్త్రచికిత్సను భారత్‌లో చేయించుకుని చికిత్స పొందారు.

£26,000 వరకు ఆదా

చికిత్స కోసం భారత్‌ను ఎంచుకోవడంతో ఆయనకు ఖర్చులోనూ భారీ ఉపశమనం లభించింది. బ్రిటన్‌లో అయ్యే ఖర్చుతో పోలిస్తే సుమారు £26,000 ఆదా చేసినట్లు వెల్లడైంది. అంటే చికిత్స కోసం ఎదురుచూసిన సమయాన్ని తగ్గించుకోవడంతోపాటు వేల పౌండ్లను కూడా మిగిల్చుకున్నారు.

భారత్‌ వైపు విదేశీ రోగుల చూపు

అధునాతన వైద్య సేవలు, చికిత్స ఖర్చుల వ్యత్యాసం కారణంగా విదేశీ రోగులు భారత్‌లో వైద్యం పొందేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో జీన్‌ పాల్‌ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. బ్రిటన్‌లో మూడేళ్ల నిరీక్షణకు బదులు భారత్‌లో శస్త్రచికిత్స చేయించుకోవడం ఇప్పుడు వైద్య పర్యాటకంపై ఆసక్తిని పెంచుతోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!