మేడ్చల్, ఆగష్టు 18(నవజ్యోతి ప్రతినిధి )
మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు గ్రామంలో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నాయకులు భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. పూడూరు గ్రామంలోని అన్ని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి.
కృతజ్ఞతలు: నిధులు మంజూరు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, సింగరేణి పోచయ్య, బాబు యాదవ్, శేఖర్ రెడ్డి, నీరుడి రఘు, మానేపల్లి వెంకటేష్ మరియు గ్రామస్తులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

