📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఏఐ మోసాలు.. ఫేక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌లపై నిఘా!

ఏఐ మోసాలు.. ఫేక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌లపై నిఘా!

సైబర్‌ నేరాల దర్యాప్తు వేగవంతం.. బాధితుల సొమ్ము రికవరీపై ప్రత్యేక దృష్టి..

హైదరాబాద్‌, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):

హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌లతో జరుగుతున్న సైబర్‌ నేరాలపై పోలీసులు దృష్టి సారించారు. భారీ మొత్తాల్లో డబ్బు కోల్పోయిన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరగా ఉపశమనం కల్పించాలని అదనపు పోలీస్‌ కమిషనర్‌ (క్రైమ్స్‌ అండ్‌ ఎస్‌ఐటీ) ఎం. శ్రీనివాస్‌ ఆదేశించారు.

ఆగస్టు 7న హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ యూనిట్‌ వార్షిక తనిఖీలో భాగంగా ఆయన పెండింగ్‌ కేసులు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విభాగం, 1930 సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ స్పందన, సిబ్బంది పనితీరును సమీక్షించారు. లక్షల రూపాయల నష్టం జరిగిన కేసులను ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.

వెంటనే ఖాతాలు ఫ్రీజ్‌ చేయాలి

సైబర్‌ మోసాల్లో బాధితులు కోల్పోయిన నగదును వీలైనంత త్వరగా నిలిపివేసి తిరిగి రాబట్టేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం పెంచాలని అధికారులను ఆదేశించారు. మోసపూరిత లావాదేవీలను గుర్తించి నిధులను సురక్షితంగా నిలిపివేసే ప్రక్రియను బలోపేతం చేయాలని సూచించారు.

డిజిటల్‌ ఆధారాలపై ప్రత్యేక దృష్టి

కేసుల దర్యాప్తులో డిజిటల్‌ ఆధారాల సేకరణ, భద్రపరచడం, చట్టపరమైన డాక్యుమెంటేషన్‌ను మరింత పటిష్టం చేయాలని శ్రీనివాస్‌ సూచించారు. పటిష్టమైన డిజిటల్‌ ఆధారాలతో కేసులను సమర్థంగా నిరూపించేందుకు వీలుంటుందని తెలిపారు.

కొత్త తరహా మోసాలపై అవగాహన

ఏఐ ఆధారిత మోసాలు, నకిలీ పెట్టుబడి యాప్‌లు, కొత్త తరహా సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనుమానాస్పద లింకులు, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లు, తెలియని యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పెండింగ్‌ కేసులకు గడువు

పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేయాలని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. బాధితుల సొమ్ము రికవరీ, నిందితుల గుర్తింపు, డిజిటల్‌ ఆధారాల సేకరణలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!