📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeతెలంగాణసూరారంలో బుల్డోజర్ల దూకుడు.. 5 ఎకరాల్లో భారీ కూల్చివేతలు

సూరారంలో బుల్డోజర్ల దూకుడు.. 5 ఎకరాల్లో భారీ కూల్చివేతలు

కలెక్టర్ ఆదేశాలతో యాక్షన్.. సర్వే 49/6లో రెవెన్యూ ఆపరేషన్

భారీ పోలీసు బందోబస్తు.. సూరారంలో బుల్డోజర్లతో కూల్చివేతల ఆపరేషన్

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 3: (నవజ్యోతి ప్రతినిధి) కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని  సర్వే నంబర్ 49/6లో ఉన్న సుమారు 5 ఎకరాల భూమిలో సోమవారం రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి, అధికారులకు భద్రత కల్పించారు.

oplus_0

సమాచారం ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. జేసీబీల సహాయంతో అక్కడ ఉన్న గుడిసెలు, తాత్కాలిక షెడ్లు, గదులు తదితర నిర్మాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల సమయంలో కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచి కార్యక్రమాన్ని కొనసాగించారు.

 

oplus_0

 

ఈ భూమి ప్రభుత్వ భూమిగా గుర్తించి ఆక్రమణలను తొలగిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కూల్చివేతల నేపథ్యంలో సర్వే నంబర్ 49/6 పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!