📄 ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్యూరియా సరఫరాలో రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం!

యూరియా సరఫరాలో రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం!

 రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బీజేపీ ఆరోపణలు

రామాయంపేట, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
రామాయంపేటలో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఒకవైపు కరువు పరిస్థితులు.. మరోవైపు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం సబ్సిడీ ఇస్తున్నా.. రైతులపై భారం!

కేంద్ర ప్రభుత్వం యూరియాపై భారీగా సబ్సిడీ అందిస్తూ 45 కిలోల బస్తాను రైతులకు సుమారు రూ.266కే అందిస్తోందని బీజేపీ నాయకులు తెలిపారు. ఒక్క బస్తాపై సుమారు రూ.1,900 వరకు కేంద్రం సబ్సిడీ భరిస్తున్నప్పటికీ.. గోదాముల నుంచి డీలర్లు, సహకార సంఘాలకు యూరియా తరలించే రవాణా ఖర్చులను రైతుల నుంచే బస్తాకు రూ.36 నుంచి రూ.38 వరకు వసూలు చేయడం దారుణమని విమర్శించారు.

రైతుపై అదనపు భారం

యూరియా బస్తాకు రూ.36–38 రవాణా భారం వసూలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. సుమారు రూ.500 కోట్ల రవాణా భారాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించింది.

రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూపులు

సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడంతో యూరియా కోసం రైతులు రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. పంటల సాగు కీలక దశలో యూరియా కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కేంద్రం రాష్ట్రానికి అవసరమైన మేరకు యూరియా కేటాయిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రాగి రాములు ఆరోపించారు.

కృత్రిమ కొరత, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి

డీలర్ల వద్ద కృత్రిమ కొరత, అధిక ధరలు, అక్రమ వసూళ్లకు తావులేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాగి రాములు డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన మేరకు యూరియాను సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరారు.

బీజేపీ డిమాండ్లు

  • యూరియా సరఫరాను వెంటనే సక్రమంగా పునరుద్ధరించాలి.
  • రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
  • రైతులపై బస్తాకు రూ.36–38 అదనపు భారం తొలగించాలి.
  • కృత్రిమ కొరత, అధిక ధరలు, అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • రైతులకు అవసరమైన మేరకు యూరియాను సకాలంలో అందుబాటులో ఉంచాలి.

రైతుల ప్రయోజనాలే ముఖ్యమంటున్న బీజేపీ

రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకుని.. యూరియా రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!