📄 ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం!

మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం!

కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర నాయకుడు చిటుకుల మహిపాల్‌రెడ్డి.. లక్ష్మీరాంరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సహాయం
తూప్రాన్‌, సెప్టెంబర్‌ 7 (నవజ్యోతి ప్రతినిధి నవీన్‌):
తూప్రాన్‌ పట్టణానికి చెందిన వడియారం మహేష్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు చిటుకుల మహిపాల్‌రెడ్డి సోమవారం మహేష్‌ కుటుంబాన్ని పరామర్శించారు.

కుటుంబానికి పరామర్శ.. నివాళి

మహేష్‌ మృతదేహానికి సంబంధించిన కుటుంబ సభ్యులను కలిసి మహిపాల్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

లక్ష్మీరాంరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌
₹1,00,000
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

అండగా ఉంటామని హామీ

లక్ష్మీరాంరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు.

కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని మహిపాల్‌రెడ్డి తెలిపారు. కుటుంబానికి ఏ సహాయం అవసరమైనా ట్రస్ట్‌ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

నాయకులు, కార్యకర్తల హాజరు

ఈ కార్యక్రమంలో తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!