📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై 31 మంది సభ్యుల జాయింట్‌ కమిటీ!

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై 31 మంది సభ్యుల జాయింట్‌ కమిటీ!

చైర్మన్‌గా బీజేపీ ఎంపీ సంజయ్‌ జైస్వాల్‌.. 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (నవజ్యోతి ప్రతినిధి):
వివాదాస్పద ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) అమెండ్‌మెంట్‌ బిల్‌–2026పై
పరిశీలనకు పార్లమెంటు సంయుక్త కమిటీ ఏర్పాటైంది. మొత్తం 31 మంది సభ్యులతో
ఏర్పాటైన ఈ కమిటీకి బీజేపీ ఎంపీ సంజయ్‌ జైస్వాల్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం కమిటీని ఏర్పాటు చేశారు.

🏛️ బీజేపీకి 14 మంది.. కాంగ్రెస్‌కు 5

జాయింట్‌ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు.
ఇందులో బీజేపీకి 14 మంది, కాంగ్రెస్‌కు 5 మంది ప్రాతినిధ్యం ఉంది.
జేడీయూ, టీఎంసీ, డీఎంకేలకు రెండేసి స్థానాలు దక్కాయి. ఎస్పీ, ఐయూఎంఎల్‌, శివసేన,
ఎన్సీపీ (ఎస్పీ), ఎన్సీపీ, టీడీపీలకు ఒక్కో సభ్యుడి చొప్పున ప్రాతినిధ్యం ఉంది.

📋 కమిటీలో కీలక సభ్యులు

లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున భర్తృహరి మహతాబ్‌, తేజస్వీ సూర్య, నిషికాంత్‌ దూబే,
అరవింద్‌ ధర్మపురి తదితరులు కమిటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆంటో ఆంటోనీ,
కెప్టెన్‌ విరియాటో ఫెర్నాండెజ్‌, మహమ్మద్‌ హమ్దుల్లా సయీద్‌, కాళీచరణ్‌ ముండా సభ్యులుగా ఉన్నారు.
ఇతర పార్టీల నుంచి జియా ఉర్‌ రెహ్మాన్‌, కల్యాణ్‌ బెనర్జీ, ఏ.రాజా, సుప్రియా సూలే తదితరులు ఉన్నారు.
⏳ శీతాకాల సమావేశాల్లోపు నివేదిక

పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటి వారంలోని చివరి రోజులోగా లోక్‌సభకు
నివేదిక సమర్పించాలని కమిటీకి గడువు విధించారు.

విదేశీ నిధులపై మరింత పర్యవేక్షణ

ఎన్‌జీవోలు, ఇతర సంస్థలకు వచ్చే విదేశీ నిధులపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం
బిల్లులోని ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ కోల్పోయిన సంస్థల ఆస్తులను
నిర్వహించి, విక్రయించేందుకు ప్రత్యేక అధికార సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది.

⚖️ విపక్షాల అభ్యంతరాలు

ఈ బిల్లు మైనారిటీలు, ఎన్‌జీవోలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ముఖ్యంగా క్రైస్తవ ఎన్‌జీవోలు, మైనారిటీలు నిర్వహించే సామాజిక సంక్షేమ, విద్యా సంస్థలకు
అందే చట్టబద్ధమైన విదేశీ నిధులపై ప్రభావం పడొచ్చని పేర్కొన్నాయి.
ప్రభుత్వం ఏమంటోంది?
ఈ బిల్లు ఏ మతానికీ ప్రత్యేకంగా వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విదేశీ విరాళాల నియంత్రణ, పారదర్శకత, పర్యవేక్షణను బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొంది.
గతంలో నాగాలాండ్‌ సీఎం నీఫియు రియో, మిజోరం సీఎం లాల్దుహోమా, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ కె. సంగ్మా
కూడా బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు జాయింట్‌ కమిటీకి పంపాలని కోరారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!