ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రామాయంపేట, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా రామాయంపేట పట్టణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) విద్యాసాగర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వివేకానంద ఆవాస విద్యాలయంలో మొక్కలు నాటారు. ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎస్ఐ నరేష్ మొక్కలు నాటారు.
మొక్కల సంరక్షణపై పిలుపు
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
రామాయంపేట రేంజ్లో 12 వేల మొక్కలు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు వివేకానంద ఆవాస విద్యాలయంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఇప్పటివరకు 12 వేల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

