📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎల్‌ నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి !

ఎల్‌ నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి !

పంట మార్పిడితో పాటు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

హైదరాబాద్‌, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో నెలకొన్న సీజనల్‌ పరిస్థితులు, NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు.

తక్కువ నీటితో పంటలు సాగు చేయాలి

ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సీఎస్‌ కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అంచనా వేస్తున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంటింజెన్సీ క్రాప్‌ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. తక్కువ నీటి అవసరం ఉండే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ప్రోత్సాహం

పంటల వైవిధ్యీకరణలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సీఎస్‌ సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

NEET-PG పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు

ఈ నెల 30న జరగనున్న NEET-PG ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను సీఎస్‌ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, భద్రత, విద్యుత్‌, తాగునీరు, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 30 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

టూరిజం అభివృద్ధికి 27 ప్రత్యేక ప్రాంతాలు

తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ సూచించారు. ప్రతి జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు.

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం 27 స్పెషల్‌ టూరిజం ఏరియాలను (STA) గుర్తించినట్లు సీఎస్‌ తెలిపారు. వాటిని మరింత అభివృద్ధి చేసి టూరిజం రంగాన్ని పురోగతి పథంలో నడిపేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు.

స్పిర్చువల్‌, హెరిటేజ్‌, ఎకో టూరిజంపై దృష్టి

తెలంగాణ బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు టూరిజం 2047 ప్రణాళికలు ఉపయోగపడతాయని సీఎస్‌ అన్నారు. స్పిర్చువల్‌, హెరిటేజ్‌, ఎకో టూరిజం, క్రాఫ్ట్స్‌ టూరిజంను విస్తరించేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

జిల్లాల ప్రత్యేకతలు, చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సంబంధిత శాఖల సమన్వయంతో అభివృద్ధి చేయాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌ సీఎస్‌ (YATC) వాణిప్రసాద్, వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పోలీస్‌ శాఖ డీజీ మహేశ్‌ భగవత్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!