📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మైనర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు !

మైనర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు !

పోక్సో కేసు నమోదు.. పరారీలో బాస్కెట్‌బాల్ కోచ్…

తెలంగాణలో మైనర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిని పలుమార్లు లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 నుంచి 2026 మధ్య రాష్ట్రంలోని పలు బాస్కెట్‌బాల్ పోటీల సందర్భంగా కోచ్ అసభ్యకర సంజ్ఞలు చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడటం, కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. తొలుత జూలై 24న ఆర్సీ పురం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అనంతరం కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

పలు టోర్నమెంట్లలో వేధింపుల ఆరోపణలు

ఫిర్యాదు ప్రకారం 2024 ఫిబ్రవరి 18న జోగులాంబ గద్వాల జిల్లా ఉట్నూర్‌లో జరిగిన టోర్నమెంట్‌లో, 2025 డిసెంబర్ 21న మాదాపూర్‌లోని డీబీఏ అకాడమీలో, అలాగే ఈ ఏడాది జూన్ 7న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పోటీల సందర్భంగా మైనర్‌ను లక్ష్యంగా చేసుకుని అసభ్య వ్యాఖ్యలు, వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

పోక్సో చట్టం కింద కేసు

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 75(1)(iv)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!