📄 ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కూలిన గచ్చిబౌలి భవన ఎఫెక్ట్‌.. అంజయ్యనగర్‌లో ‘డేంజర్‌’ బిల్డింగులపై HYDRAA నజర్‌!

కూలిన గచ్చిబౌలి భవన ఎఫెక్ట్‌.. అంజయ్యనగర్‌లో ‘డేంజర్‌’ బిల్డింగులపై HYDRAA నజర్‌!

50 గజాల్లో ఏడంతస్తుల నిర్మాణంపై ఆందోళన.. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై ప్రత్యేక డ్రైవ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో పరిసరాల్లోని ఇతర భవనాలపై
అధికారుల దృష్టి పడింది. నిబంధనలకు విరుద్ధంగా, నాలా సమీపంలో నిర్మించిన
అనధికార, ప్రమాదకర భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు
చేపట్టనున్నట్లు HYDRAA కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

50 గజాల్లో 7 అంతస్తుల భవనం!

కేవలం 50 చదరపు గజాల స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన
పరిస్థితులు అంజయ్యనగర్‌లో ఉన్నాయని రంగనాథ్‌ తెలిపారు. నాలా సమీపంలో తప్పనిసరి
సెట్బ్యాక్‌లు లేకుండా, అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని
పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో HYDRAA, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC) సంయుక్తంగా
ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఇలాంటి భవనాలను పరిశీలించనున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా
ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ స్పష్టం చేశారు.

🚨 కూలిన భవనంపై ముందే ఫిర్యాదు?

కూలిపోయిన భవనంపై గతంలోనే ఫిర్యాదు అందిందని CMC కమిషనర్‌
సృజన తెలిపారు. ఫిర్యాదు నేపథ్యంలో నిర్మాణ పనులను నిలిపివేసినప్పటికీ
ఆ తర్వాత పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, చివరకు శనివారం భవనం కూలిపోయిందని చెప్పారు.

అంజయ్యనగర్‌లోని ఇతర భవనాలను కూడా HYDRAAతో కలిసి పరిశీలించి, నిర్మాణ నిబంధనలు
ఉల్లంఘించిన వాటిపై చర్యలు తీసుకుంటామని CMC అధికారులు తెలిపారు.

పక్కనున్న అపార్ట్‌మెంట్‌కు ప్రమాదం

ఏడంతస్తుల భవనం కూలిన సమయంలో దాని శిథిలాలు పక్కనే ఉన్న
జయదర్శిని అపార్ట్‌మెంట్‌పై పడటంతో భవనం కొంతమేర దెబ్బతింది.
అక్కడి పరిస్థితిని రంగనాథ్‌ పరిశీలించారు. శిథిలాలను వెంటనే తొలగించి,
అనంతరం అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పటిష్ఠతను నిపుణులతో పరీక్షించి ధ్రువీకరించనున్నట్లు తెలిపారు.

⚠️ భవనం సేఫ్టీపై కీలక సూచన
దెబ్బతిన్న అపార్ట్‌మెంట్‌లోని ప్రమాదకర భాగాలను
భద్రతా పరీక్ష పూర్తయ్యే వరకు వినియోగించవద్దని
నివాసితులకు అధికారులు సూచించారు.

రెస్క్యూ ఆపరేషన్‌ పరిశీలన

కూలిన భవనం వద్ద HYDRAA, NDRF, SDRF, CMC, పోలీసులు చేపట్టిన సహాయక,
శోధన చర్యలను రంగనాథ్‌ పరిశీలించారు. HYDRAA అదనపు డైరెక్టర్‌
వర్ల పాపయ్య, CMC కమిషనర్‌ సృజన తదితరులు
ఆయన వెంట ఉన్నారు.

🌿 భక్తి సామగ్రి సేకరణకు CMC ప్రత్యేక డ్రైవ్‌

17 ఆలయాల నుంచి 2,425.85 కిలోల సామగ్రి సేకరణ

సైబరాబాద్‌ పరిధిలో CMC నిర్వహించిన ‘డివైన్‌ కలెక్షన్‌ డ్రైవ్‌’కు
మంచి స్పందన లభించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 17 ఆలయాల్లో
నిర్వహించిన కార్యక్రమంలో 2,425.85 కిలోల భక్తి సామగ్రిని సేకరించారు.

ఈ డ్రైవ్‌కు 922 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు CMC తెలిపింది.
పాత, వినియోగంలో లేని విగ్రహాలు, లోహ వస్తువులు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (POP),
ప్లాస్టిక్‌, చెక్క ఫ్రేములు, గాజు వస్తువులు, పుస్తకాలు తదితరాలను ప్రజలు అప్పగించారు.

సేకరించిన సామగ్రిని ముందుగా బరువు నమోదు చేసి, అనంతరం ఉద్గ్వాసన పూజ నిర్వహించారు.
ఆ తర్వాత వాటిని విడదీసి వేర్వేరు పదార్థాలుగా వర్గీకరించి రీసైక్లింగ్‌, తదుపరి
ప్రాసెసింగ్‌కు తరలించారు.

ఈ కార్యక్రమంలో CMC కమిషనర్‌ కూడా ఒక ఆలయంలో పాల్గొని ఏర్పాట్లు, సేకరణ ప్రక్రియను
పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను CMC అభినందించింది. మరో విడతలో మరింత
విస్తృతంగా డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!