మనోహరబాద్, 10 సెప్టెంబర్ ( నవజ్యోతి ప్రతినిధి నవీన్ ) :
మనోహరబాద్ మండలనికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన సీఎంఆర్ చెక్కులను గురువారం రోజున శక్తులను పంపిణీ చేసిన నాయకులు, రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరైనట్లు తెలిపారు, ఈ సందర్భంగా డీసీసీ కార్యదర్శి జావిద్ పాషా మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి జావీద్ పాషా, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, చిట్కుల నితిన్ రెడ్డి, ఏండి లయిక్, సాయి కృష్ణ రెడ్డి, రాజు, ఎల్లం, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

