మనోహరాబాద్, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
వెల్దుర్తి నుంచి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేపట్టిన మహా పాదయాత్రలో మనోహరాబాద్ మండల నాయకులు పాల్గొన్నారు.

మాజీ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పురం మహేష్, జిల్లా ఉప సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు రేణుకుమార్, పార్టీ ముఖ్య నాయకులు లక్ష్మణ్సింగ్, పోతారం మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, దండుపల్లి మాజీ ఉప సర్పంచ్ మహేందర్గౌడ్, పోతారం మాజీ ఉప సర్పంచ్ వీరేష్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్షపతి, మనోహరాబాద్ మాజీ పార్టీ అధ్యక్షుడు నరేందర్గౌడ్, నాయకులు శైలేందర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

