📄 ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అదృశ్య శక్తులపై చర్యలు తీసుకోండి: కొండా సురేఖ !

అదృశ్య శక్తులపై చర్యలు తీసుకోండి: కొండా సురేఖ !

తనపై, కుటుంబంపై జరుగుతున్న విమర్శల వెనుక ఉన్న వారిని గుర్తించాలని క్రమశిక్షణా సంఘానికి లేఖ

హైదరాబాద్, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):

తనపై, తన కుటుంబ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్న వారి వెనుక ఉన్న
అదృశ్య శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్‌
క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు మల్లు రవిని కోరారు. ఈ మేరకు
ఆగస్టు 22న ఆమె లేఖ రాశారు.

తాఖీదుకు ఇప్పటికే వివరణ

క్రమశిక్షణా సంఘం జారీ చేసిన తాఖీదుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.
పార్టీ నాయకత్వం, పార్టీ నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు.
తనకు జారీ చేసిన తాఖీదును ఉపసంహరించుకోవాలని కూడా కోరినట్లు వెల్లడించారు.

🔴 మూకుమ్మడి విమర్శలపై ఆందోళన

విచారణ కొనసాగుతున్న సమయంలోనే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు
ఒకే తరహాలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం
ఆందోళన కలిగిస్తోందని సురేఖ పేర్కొన్నారు.

ఎవరి ప్రేరణతో మాట్లాడుతున్నారో తేల్చాలి

పలువురు నేతలు స్వతంత్రంగా కాకుండా ఎవరి ప్రేరణతోనో, ఒక నిర్దిష్ట లక్ష్యంతో
మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతోందని మంత్రి అన్నారు. వెనుకబడిన తరగతులకు
చెందిన సీనియర్ మహిళా నాయకురాలైన తనపై మూకుమ్మడి దాడులు జరుగుతున్నప్పుడు
నాయకత్వం మౌనం వహించడం సరికాదని పేర్కొన్నారు.

క్రమశిక్షణా సంఘం నిర్ణయంపై ప్రభావం ఉందా?

బహిరంగంగా తనను నిందిస్తూ, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, చర్యలు తీసుకోవాలని
మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా సంఘం స్వతంత్ర నిర్ణయాన్ని
ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా అనే కోణంలోనూ విచారణ జరపాలని
కొండా సురేఖ కోరారు.

మంత్రి లేఖలోని ప్రధాన డిమాండ్: తనపై, కుటుంబ సభ్యులపై జరుగుతున్న
విమర్శల వెనుక ఉన్న వ్యక్తులు, శక్తుల పాత్రపై విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి
తీసుకురావాలని సురేఖ కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!