📄 ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైక్‌ దొంగతనాల ముఠా గుట్టురట్టు !

బైక్‌ దొంగతనాల ముఠా గుట్టురట్టు !

టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్‌.. మూడు బైక్‌లు, మూడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం
బిక్కనూరు, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):

భిక్కనూరు టోల్‌ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీల సందర్భంగా బైక్‌ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. దొంగిలించిన బైక్‌లను హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములను భిక్నూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దొంగిలించిన మూడు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ ఎస్‌. అనిల్‌ తెలిపారు.

టోల్‌ప్లాజా వద్ద పట్టుబడ్డారు

పోలీసుల వివరాల ప్రకారం.. శివాయిపల్లి, రాజంపేట మండలానికి చెందిన శివరాత్రి శంకర్‌ (38), అతని తమ్ముడు కృష్ణ కలిసి బైక్‌ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దొంగిలించిన బైక్‌లను హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఆగస్టు 17న వెళ్తుండగా భిక్నూర్‌ టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.

మూడు బైక్‌లు చోరీ

విచారణలో నిందితులు భిక్నూర్‌ టోల్‌ప్లాజా వద్ద Passion Plus (AP10AP0322) బైక్‌ను, అహ్మద్‌ కాలేజ్‌ సమీపంలో గేట్‌ తాళం పగలగొట్టి Glamour (TS16ED9299) బైక్‌ను దొంగిలించినట్లు తెలిపారు. గతంలో Bajaj Boxer (AP29C7122) బైక్‌ను కూడా చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

  • Passion Plus – AP10AP0322
  • Glamour – TS16ED9299
  • Bajaj Boxer – AP29C7122
  • GIVA కీప్యాడ్‌ ఫోన్
  • Redmi మొబైల్‌ ఫోన్
  • GIONEE మొబైల్‌ ఫోన్

ఇతర చోరీలపై దర్యాప్తు

నిందితులకు ఇతర వాహనాల దొంగతనాలతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో చోరీకి గురైన ఇతర వాహనాలను గుర్తించి రికవరీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!